Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై మాయావతి ఆగ్రహం
లక్నో: ''సౌభాగ్య పథకం'' ద్వారా నిరుపేదలకు ఉచిత విద్యుత్ అందిస్తామంటూ వారి ఓట్లను దండుకొని బీజేపీ అధికారంలోనికి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక అదే ప్రజల ఆదాయానికి గండి కొట్టడానికి ''దౌర్భాగ్య పథకాన్ని'' రూపొందిస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యోగి ప్రభుత్వంపై విమర్శాస్త్రాలను సంధించారు. బీజేపీ అధికారంలోకి వస్తే దారిద్య్రరేఖకు (బీపీఎల్) కింద నివసిస్తున్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ను అందిస్తామంటూ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం విద్యుత్ చార్జీలను పెంచుతూ పేదలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని విమర్శించారు. బీజేపీ పాలనలో ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలు కరువయ్యాయని. ఎన్నడూ లేని విధంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయని విమర్శించారు. నేరాల నియంత్రణపై దష్టి పెట్టకుండా.. యోగిసర్కార్ విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యులపై భారాన్ని మోపడానికి సిద్ధమవుతోందని ఎద్దేవా చేశారు.