Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడి బాధితురాలి ఆత్మహత్య
- ఉత్తరప్రదేశ్లో ఘటన
లక్నో : ఉత్తరప్రదేశ్లో పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తూ... లైంగికదాడి బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుదౌన్ జిల్లాలోని దాతాగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కాగా, బాధ్యతారహితంగా వ్యవహరించిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్ను అధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే..కొన్నేండ్ల క్రితం పెండ్లి చేసుకున్న 24 ఏండ్ల మహిళ భర్తతో అభిప్రాయబేధాలు తలెత్తడంతో తల్లిదండ్రులతోనే ఉంటున్నది. కాగా, తన భర్త అనారోగ్యంగా ఉన్నాడని చెబుతూ.. దూరపు బంధువులు ఆ మహిళను తెలంగాణలోని సికింద్రాబాద్కు తీసుకొచ్చారు. ఇక్కడ ఓ గదిలో వారం రోజులు బంధించి లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు ఆమె సూసైడ్ లేఖలో రాశారు. వారి వద్దనుంచి తప్పించుకుని తల్లిదండ్రిని చేరినాక.. బాధితురాలు.. దుండగులపై ఫిర్యాదు చేసేందుకు దాతాగంజ్ పోలీసు స్టేషన్కు శనివారం వెళ్లింది. కానీ, నేరం జరిగింది సికింద్రాబాద్లో గనుక కేసు అక్కడే నమోదు చేయాలని పోలీసులు తెలుపగా.. తాను యూపీ నివాసినే కాబట్టి ఇక్కడే నమోదు చేయాలని బాధితురాలు పట్టుబట్టింది. కాగా, కొద్దిసేపు వాగ్వాదం జరిగాక.. బాధితురాలు ఇంటికెళ్లింది. కాగా, ఆదివారం కేసు నమోదు చేసి పోలీసులు బాధితురాలి ఇంటికెళ్లగానే అప్పటికే ఆమె ఉరేసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్హెచ్వో అమృత్లాల్ను బుదౌన్ ఎస్ఎస్పీ అశోక్ కుమార్ త్రిపాఠి సస్పెండ్ చేశారు.
యూపీలో దళిత రైతు హత్య
దళితులపై దాడు లు ఆగడం లేదు. ఉత్తర ప్రదేశ్లోని ప్రతాప ్గఢ్లో ఓ దళిత రైతుపై దాడి చేసి చంపేశారు . అనంతరం నిప్ప ంటించగా.. కాలిపోయిన స్థితిలో మృత దేహం లభించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ప్రతాప్గఢ్ జిల్లాలోని బేలా రాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దళిత రైతు వినరు సరోజ్ మృతదేహం పంటపొలాల్లో కాలిపోయిన స్థితిలో లభించిందని పోలీసులు సోమవారం తెలిపారు. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు ఎవరూ అరెస్టుకాలేదని తెలిపారు.