Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ జవాను మృతి,ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కొద్ది రోజులుగా భద్రతాబలగాలే లక్ష్యంగా చేసుకుని వరుస కాల్పులకు తెగబడుతున్నారు. అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు గత సోమవారం జరిపిన కాల్పుల్లో ఓ భద్రతా అధికారి ప్రాణాలుకోల్పోగా, మరో అధికారి తీవ్రగాయాలపాలయ్యారు. దీనికి కొనసాగింపుగా ఇదే జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను మృతి చెందగా, మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన ఉగ్ర వాదుల్లో ఒకరు పుల్వామా ఉగ్రదాడిలో వాడిన కారు యజమానిగా భద్రతా సిబ్బంది గుర్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంత్నాగ్లోని మారహమ్ గ్రామంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు ఆ ప్రాంతంలో కార్టన్ సెర్చ్ ఆపరే షన్ నిర్వహించాయి. దీన్ని గమనించిన ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు సైతం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. కాగా, మృతిచెందిన ఇద్దరు ఉగ్రవాదులూ జైషేమహ్మద్ సంస్థకు చెందిన తాసీఫ్ అహ్మద్ భట్, సజ్జద్ భట్గా గుర్తించారు. వీరి ద్దరూ పుల్వామా దాడిలో కీలక పాత్ర పోషించినట్టుగా పోలీసులు తెలి పారు. పుల్వామా దాడిలో వాడిన కారు సజ్జద్ భట్కు చెందినదిగా వెల్ల డించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. అయితే ఈ ఏడాదిలో జమ్మూకాశ్మీర్లో ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 113 మంది ఉగ్రవాదులు మృతిచెందగా, 26 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.మరో వైపు పూల్వామాలోని పోలీస్స్టేషన్పై గ్రెనైడ్ దాడి జరగ్గా 8 మంది జవాన్లకు గాయాలయ్యాయి.