Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థికశాఖకు చెందిన దాదాపు 15 మంది సీనియర్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అధికారులపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. అవినీతికి పాల్పడటం, లంచం తీసుకున్నారన్న అభియోగాలపై వీరిని ఇంటికి సాగనంపారు. ఢిల్లీలోని సీబీఐసీలో ప్రిన్సిపల్ ఎడిజిగా పనిచేస్తున్న ప్రిన్సిపల్ కమిషనర్ అనుప్ శ్రీవాత్సవ్, జాయింట్ కమిషనర్ నళిన్ కుమార్ తదితర ఉన్నతాధికారులు వీరిలో ఉన్నారు. సిబిఐ 1996లో అనుపమ్ శ్రీవాత్సవ్పై నేరపూరిత కుట్ర కేసును నమోదు చేసిందని సంబంధికులు తెలిపారు. 'ఆదేశిక సూత్రాలలోని రూల్ 56 క్లాజ్ (జే) మేరకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలతో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 50 సంవత్సరాల వయస్సు నిండిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు చెందిన 15 మంది అధికారులను వెంటనే రిటైర్ కావాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదేశించారు'' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ట్వీట్ చేసింది.