Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ తరహా మరణాల్లో ఏపీ రెండో స్థానంలో..
ముంబయి: మహారాష్ట్రలో 11 నెలల్లోనే హెచ్ఐవీ వల్ల 2460మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి ఏక్నాథ్షిండే మంగళవారం ప్రకటించారు. 2018 ఏప్రిల్ 1 నుంచి 2019 ఫిబ్రవరి 28 వరకు ఈ మరణాలు సంభవించినట్టు మంత్రి తెలిపారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్ఏసీవో) చేపట్టిన ప్రత్యేక స్కీం కింద అనుమానిత వ్యక్తులకు పరీక్షల నిర్వహణ, చికిత్స కొనసాగిస్తున్నట్టు షిండే తెలిపారు. హెచ్ఐవీ మరణాల్లో దేశంలోనే మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. 1428 మరణాలతో రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్, 1388 మరణాలతో మూడోస్థానంలో కర్నాటక నిలిచాయి. అంతకు ముందు వరుసగా రెండేండ్లపాటు హెచ్ఐవీ మరణాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉండటం గమనార్హం. ఏపీలో 2017-18లో 1904, కర్నాటకలో 1719, మహారాష్ట్రలో 1361 మరణాలు, 2016-17లో ఏపీలో 1978, కర్నాటకలో 1673, మహారాష్ట్రలో 1390మరణాలు సంభవించాయి.