Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ సీఎంకు చేదు అనుభవం
- మెదడువాపు వ్యాధి సోకిన చిన్నారుల బంధువుల ఆందోళన నితీశ్కు నిరసన సెగ
పాట్నా : బీహార్లో మెదడువాపు వ్యాధి విజృంభణతో పదుల సంఖ్య లో చిన్నారులు చనిపోతున్నారు. వందలాది మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముజఫర్ఫూర్లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి, వైద్యులతో సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. వ్యాధిని అదుపు చేయడంలో ప్రభుత్వ అలసత్వ వైఖరికి నిరసనగా రోగుల బంధువులు, సన్నిహితులు ఆస్పత్రి బయట పెద్దసంఖ్యలో గుమిగూడి నితీశ్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నల్లజెండాలు చూపిస్తూ 'నితీశ్కుమార్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. మెదడువాపు వ్యాధి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలనీ, బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), ఎస్ఎఫ్ఐ తదితర ప్రజా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు నిర్వహించాయి.
127కు చేరిన మృతుల సంఖ్య
బీహార్లో మెదడువాపు వ్యాధి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య మంగళవారం నాటికి 127కు చేరిందని అధికారవర్గాలు తెలిపాయి. ఇందులో 108 మరణాలు ముజఫర్పూర్ జిల్లాలోనే నమోదయ్యాయి.
ఎన్ని వికెట్లు పడ్డాయ్..?
అభంశుభం తెలియని చిన్నారులు చనిపోతుంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్పాండే చాలా నిర్లక్షంగా వ్యవహరించి విమర్శలపాలయ్యారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మెదడువాపు వ్యాధి విజృంభణ, వడగాలులు వంటి విషాద పరిస్థితులకంటే క్రికెట్ మీదనే ఆయన ఎక్కువ ఆసక్తిగా కనబర్చారు.