Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
17వ లోక్సభ స్పీకర్గా రాజస్థాన్కు చెందిన బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నిక కానున్నారు. నేడు(బుధవారం) స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ నిర్వహించనున్నారు. ఓం బిర్లా ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లాను బీజేపీ ఎంపిక చేసింది. ఆయన పేరును ప్రధాన మంత్రినరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు ప్రతిపాదించారు. వైసీపీ, బీజేడీ, శివసేన, ఎన్సీపీ, ఎంఎన్ఎఫ్, శిరోమణి అకాళీ దళ్, ఎల్జేపీ, జేడీయూ, అన్నాడీఎంకెే, అప్నాదళ్ పార్టీలు సంతకాలు చేశాయి. అనంతరం ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతిస్తున్నట్టు బీజేడీ తీర్మానం ఆమోదించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ తాము కాంగ్రెస్ను సంప్రదించామని, కానీ వారు ప్రతిపాదనలపై సంతకం చేసేందుకు నిరాకరించారని తెలిపారు.