Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో వారంలో పుంజుకోనున్న రుతుపవనాలు
న్యూఢిల్లీ : సోమవారం వరకూ దేశవ్యాప్తంగా కురిసిన రుతుపవన వర్షపాతంలో 43 శాతం లోటు నమోదైందని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు మంగళవారం తెలిపారు. మరో వారంలో రుతుపవనాలు తిరిగి పుంజుకుంటాయని ఐఎండీ పేర్కొంది. సాధారణం కంటే వారం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ఈనెల 8న దేశంలోని ప్రవేశించాయి. ఈ కారణంగానే లోటు వర్షపాతం నమోదైందని వారు చెబుతున్నారు. ఈనెల 11న అరేబియా సముద్రంలో ఏర్పడిన 'వాయు' తుపాను రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. రుతుపవనాలు ఆదివారం నాటికి కర్నాటకలోని మంగళూరుకు చేరుకున్నాయనీ, అనంతరం గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్లోని ప్రాంతాల వైపు సాగుతున్నాయని న్యూఢిల్లీలోని జాతీయ వాతావరణ సూచన కేంద్రం ఉన్నతాధికారి కె.సతీదేవి అన్నారు. మరో 4-5 రోజుల్లో కర్నాటక, మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిషాలకు చేరుకుంటాయని సోమవారం ఐఎండీ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొరది. మరోవైపు వాయు తుపాను ఈశాన్య దిశగా సాగి బలహీనపడుతోందని తెలిపింది. 'రుతుపవనాల రాక ఆలస్యమైనా, తరువాత పుంజుకోవాల్సి ఉంది. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఎల్నినో, వాయు తుపాన్ ప్రభావం వలన ఈ ఆలస్యం జరిగింది' అని స్కైమేట్ అనే ప్రయివేట్ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడు మహేశ్ పల్వాట్ అన్నారు.