Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుడిపై ఆగంతకుల దాడి
- అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో ఘటన
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా కులాంతర వివాహంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రక్షణ కల్పించాలంటూ కోర్టుకు వెళ్లిన వారిపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో దాడికి పాల్పడ్డారు. గతవారం సాక్షిమిశ్రా అజితేశ్ కుమార్ అనే దళిత యువకుడి ప్రేమించి, పెండ్లి చేసుకుంది. కానీ తనతండ్రి నుండి తన భర్తకు, అతని కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని, తన తండ్రి గుండాలు తమపై ఓసారి దాడికి తెగబడ్డారని.. ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టుచేసిన విషయం తెలిసిందే. ఆ నవదంపతులు భయపడినట్టుగానే వారిపై తన తండ్రి గుండాలు దాడికి పాల్పడ్డారు. తమ ప్రాణాలకు ముప్పుందని, రక్షణ కావాలని అర్జిస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ కోసం పోలీసుల రక్షణలో వేచి ఉన్నప్పటికీ.. అజితేశ్ కుమార్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో ఆ దంపతులు చేసిన వాదనకు మరింత బలం చేకూరినట్టయింది. ఈ దాడిపై స్పందించిన అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపి, దంపతులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని పోలీసు సూపరింటెండెంట్ను ఆదేశించింది.