Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతువుల్లా ప్రవర్తిస్తారు : బీజేపీ ఎమ్మెల్యే
లక్నో : ముస్లింలపై బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మరోసారి విద్వేష వ్యాఖ్యలుచేశారు. బల్లియా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. 'ముస్లింలకు 50మంది భార్యలుంటారు. 1050 మంది పిల్లలను కనిపారేస్తారు. ఇది సాంప్రదాయంకాదు... కానీ, వారు జంతు వుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరి నుంచి నలుగురుని కనటం సమాజంలో సాధారణమైన విషయం' అన్నారు. ఇటీవల ఆయన వైద్యులపైనా తీవ్ర వ్యాఖ్యలుచేశారు. 'ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు రోగులతో బేరసారాలాడుతున్నారు. వారు రాక్షసులుగా మారారు. వారికి మంచి ఆలోచనా బుద్ధి ప్రసాదించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను' అన్నారు. హిందూత్వం చెక్కుచెదరకుండా ఉండాలంటే దేశంలో హిందువులందరూ ఐదుగురు పిల్లలని కనాలని కూడా ఆయన గతంలో వ్యాఖ్యానించారు. అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావతిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజా వ్యాఖ్యలపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి