Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్లో ఏర్పాటు చేసే గిరిజన విశ్వ విద్యాలయానికి రోహిత్ వేముల పేరు పెట్టాలని రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ కోరారు. కేేంద్ర విశ్వ విద్యాలయ (సవరణ) బిల్లుపై మంగళవారం జరిగిన చర్చలో కేరళకు చెందిన మార్క్సిస్టు పార్టీ ఎంపీి కె. కె . రాగేష్ పాల్గొంటూ ఈ ప్రతిపాదన చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత రిసెర్చి స్కాలర్ రోహిత్ వేముల దళితులకు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటంలో 2016 జనవరి17న ప్రాణ త్యాగం చేశారు. కావున గిరిజన యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం ఎంతైనా సముచితమని రాగేష్ చెప్పారు.