Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశంలో రోజురోజుకూ పరువు హత్యలు పెరిగిపోతు న్నాయి. సొంత తల్లిదండ్రులే తమ పిల్లలపై దాడులకు దిగుతూ.. గుట్టు చప్పుడు కాకుండా హత్యలు చేస్తున్నారు. ఇలాంటి పరువు హత్యే ముంబ యిలోని ఘట్కాపోర్ ప్రాంతంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కన్న తండ్రే పెండ్లై గర్భవతిగా ఉన్న తన కూతురును దారుణంగా హత్య చేశాడు. ఈదారుణానికి ఒడిగట్టిన నిందితుడు రాజ్ కుమార్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ల వివరాల ప్రకారం.. తండ్రి రాజ్కుమార్ తెచ్చిన పెండ్లి సంబంధాన్ని కాదనీ, తన కూతురు ప్రేమించిన యువకుడు బ్రిజేష్ చౌరాషియాను పెండ్లి చేసుకుంది. దీంతో ఆమెపౖౖె నిందింతుడు పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని నెలలు గడిచిన అనంతరం కూతురికి బట్టలు కొనిస్తానని చెప్పి ఇంటికి రమ్మని చెప్పాడు. ఇంటికి వచ్చిన కూతురి తలను కత్తితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఫోన్ సిగల్స్ ద్వారా నిందితుడ్ని గుర్తించి, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.