Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ట్రాఫిక్ నిబంధనలకు నగర మేయర్లు సైతం మినహాయింపు కాదని నిరూపించింది ముంబయిలో చోటుచేసుకున్న ఓ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. ముంబయి మహానగర మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్.. విలేపార్లే ప్రాంతంలో స్థానిక శివసేన నాయకుడితో కలిసి పర్యటించారు. ఈ సమయంలో మేయర్ అధికారిక వాహనం ఓ ఫుడ్ పాయింట్ ఎదుట నిలిపి ఉంచడం పోలీసులు గమనించారు. అది 'నో పార్కింగ్' ప్రాంతం కావడంతో వెంటనే నిబంధనల్ని ఉల్లంఘించినందకు మేయర్ వాహనం పేరిట చలాన్ జారీ చేసినట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. రెండు వారాల నుంచి ముంబయిలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిగల్ జంపింగ్, మద్యం సేవించి వాహనాల్ని నడపడం, నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలపడం లాంటి ఉల్లంఘనలకు జరిమానాలను విధిస్తూనే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.