Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రులకు (పీఏఆర్) గ్రేడింగ్ ఇచ్చే అధికారాన్ని తొలగిస్తూ పంజాబ్,హర్యానా ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హర్యానా సీఎం మనోహర్లాల్ ఖత్తర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు ఇచ్చిన గ్రేడింగ్పై పునర్ సమీక్షించే విషయంలో అధికారాన్ని తొలగించడాన్ని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ విచారణ కోసం అశోక్ ఖేమ్కాకు నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా పనితీరుపై సంబంధిత శాఖ మంత్రి అనిల్ విజ్ 9.92 స్కోరును ఇవ్వగా.. ఆ స్కోరును సీఎం లాల్ ఖత్తర్ 9కి తగ్గించారు. ఇటీవల ఐఏఎస్ పనితీరుపై గ్రేడింగ్ (పీఏఆర్)పై హర్యానా హైకోర్టు తీర్పు నిస్తూ.. అధికారి పనిచేస్తున్న సంబంధిత మంత్రిత్వశాఖకు మాత్రమే పునర సమీక్షించే అధికారం ఉంటుందని పేర్కొంటూ.. తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై వివాదం నెలకొనడంతో హర్యానా సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు.