Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డీజీసీఏ వేటు
ముంబయి: దేశవ్యాప్తంగా వివిధ విమాన సంస్థలో పనిచేస్తున్న 20మంది ఫైలెట్లపై తాత్కాలికంగా సస్పెన్షన్ విధించినట్టు మంగళవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. జూన్లో వీరిలో కొందరు ఏవియేషన్ నిబంధనలను ఉల్లంఘించారనీ, మరికొందరు విమానాల ల్యాండింగ్, టేక్ఆఫ్ సమయాల్లో సరైన జాగ్రత్తలు వహించక ప్రమాదాలకు కారకులయ్యారనే ఆరోపణలపై తొలగిస్తున్నట్టు డీజీసీఏ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జూన్ 30 నుంచి జులై 2 వరకు ఏడు విమాన ప్రమాదాలు జరిగాయని డీజీసీఏ వెల్లడించింది. ఈ ప్రమాదాలపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. విమాన భద్రతా ఆడిట్ తర్వాత స్పైస్ జెట్, ఇండిగో, కాలికట్, అహ్మదాబాద్, చెన్నైలకు షోకేస్ నోటీసులు డీజీసీఏ పంపింది. ఒకేసారి ఇంతమంది ఫైలెట్లను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి.