Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీనియర్ అడ్వకేట్లు ఇందిరా జైసింగ్, ఆనంద్ గ్రోవర్ ల ఇండ్లు, కార్యాలయాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు నిర్వహించడాన్ని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) ఖండిం చింది. సీబీఐ చర్య.. భారత రాజ్యాంగం లాయర్లకు కల్పించిన స్వతంత్ర తపై దాడిగా అభిర్ణించింది. ఈ మేరకు బీఏఐ ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసింది. సీబీఐ చర్య సరియైనది కాదని, న్యాయవిరుద్దమని అసోసియేషన్ పేర్కొన్నది. ఓ కేసుకు సంబంధించి ఫారీన్ కాంట్రి బ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరో పణలతో న్యాయవాదుల ఇండ్లలో ఈనెల 11న సీబీఐ సోదాలు నిర్వహిం చిన విషయం తెలిసిందే. విదేశీ నిధుల వినియోగంలో అవకతవకలకు సంబంధించి గ్రోవర్, ఆయన ఎన్జీవో లాయర్స్ కలెక్టివ్పై సీబీఐ గతనెల కేసును నమోదు చేసింది. సదరు ఎన్జీవోకు గ్రోవర్ ధర్మకర్తగా, డైరెక్టర్గా ఉన్నారు. ఆయన భార్య అయిన ఇందిరా జైసింగ్.. సంస్థకు సెక్రెటరీగా వ్యవహరించారు. మానవహక్కుల కోసం కొన్నేండ్లుగా పనిచేసిన తమను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని ఇందిరా గతవారం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.