Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 'దొంగలందరూ మోడీ పేరును కలిగిఉన్నారని' వ్యాఖ్యానించి పరువునష్టం దావా ఎదు ర్కొంటున్న రాహుల్కి గుజరాత్ హైకోర్టు ఊరటనిచ్చింది. మంగళవారం ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఆయన వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది. కాగా, ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ ఈ ఏడాది ఏప్రిల్ 16న పరువునష్టం దావా వేశారు.