Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక హక్కులు కాలరాస్తున్న
మోడీ సర్కారు : మీడియాతో
ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మోడీ సర్కారు అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆలిండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అభిప్రాయపడ్డారు. కార్మిక చట్టాలను కుదించడంపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరవు ఛాయలు అలుముకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే కరువు నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐకేస్ జాతీయ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ రంగ సంక్షోభం - సామాజిక సహకార వ్యవస్థ నిర్మాణంలో కర్షకుల పాత్రపై సెమినార్ జరిపినట్టు వెల్లడించారు. ఈ సెమినార్ కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ప్రారంభించారని, ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేష్ ఆత్రేయ కీలక ఉపన్యాపం చేశారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న పలు కీలక అంశాలు, వాటి సాధనకు తీర్మానాలను సెమినార్లో ఆమోదించినట్టు వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరువు పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విపత్తు దాటికి చితికి పోయిన రైతులకు ఆర్థిక ఇతోధికానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఆయా రైతాంగానికి నరేగా పథకాన్ని ఉపయోగించే విధంగా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఇన్యూరెన్స్ కంపెనీలు కుమ్మక్కు అయ్యాయని విమర్శించారు. రైతుల నుంచి ఇన్యూరెన్స్ డబ్బులు తీసుకొని విపత్తు సమయంలో రైతులకు ఇవ్వడం లేదని అన్నారు. కార్పొరేట్ల జేబులు నింపేందుకు మాత్రమే ఈ ఇన్యూరెన్స్ కంపెనీలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాము క్షేత్రస్థాయిలో పోరాడతామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు ప్రత్యేకంగా ఏమి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీరో అగ్రికల్చర్ అంటే ఏంటో ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. మద్దతు ధర కోసం రైతులు గత కొన్ని సంవత్సరాలు రోడ్డు ఎక్కుతుంటే... ప్రభుత్వం మాత్రం బడ్జెట్ ఎటువంటి ఆశాజనక అంశం ఒక్కటీ లేదని అన్నారు. సీతారామన్ బడ్జెట్ని రైతు వ్యతిరేక పద్దుగా అభివర్ణించారు. రైతుల హక్కులతో పాటు కార్మికవర్గ ప్రయోజనాలను కేంద్రం కాలరాస్తుందని మండిపడ్డారు. సుమారు 13 చట్టాలను ఒకే చట్టంతో కాలరాస్తున్నారు. అటవీ హక్కుల ప్రయోజనాలను ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఏండ్ల తరబడి అడవుల్లో బతుకుతున్న ఆదివాసీలను బీజేపీ అక్కడి నుంచి వెలివేయాలని యోచిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకి అటవి భూములను అప్పగించాలని ప్రయత్నిస్తుందన్నారు. ఈ విషయంపై తాము జూలై 22 వ తేదీన ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. దాంతోపాటు ఏఐకేఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చినట్టు చెప్పారు. ఏఐకేఎస్ జాతీయ సంయుక్త కార్యదర్శి విజూ క ష్ణన్ మాట్లాడుతూ... ఇటీవల రైతు సంఘం ఆధ్వర్యంలో జరిపిన సెమినార్లో పలు అంశాలపై కీలకంగా చర్చించినట్టు చెప్పారు.
రైతు సమస్యలకి సంబంధించి తక్షణమే రెండు బిల్లులను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న లోన్లను ప్రభుత్వమే మాఫీ చేయాలని కోరారు. రాష్ట్రపతి కూడా ఈ రెండు బిల్లులను ప్రైవేట్ బిల్లు రూపంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా చూస్తానని హామీనిచ్చినట్టు గుర్తు చేశారు. ఆయన హామీనిని నిలబెట్టుకోవాలన్నారు. ఈ విషయంలో నమ్మక ద్రోహం చేసిన బీజేపీ ప్రభుత్వ చర్యలకు నిరసనగా తాము ఆగస్టు 3వ తేదీన నిరసన అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. దాంతోపాటు కార్మికులు పోరాడి సాధించుకున్న ఎన్నో హక్కులపై కేంద్రం దాడి చేస్తుందని మండిపడ్డారు. కార్మికులకు పని స్థలాల్లో 8 గంటలకు బదలు 14 పని చేయించేందుకు మోడీ సర్కారు కుట్రలు పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దేశంలోని 70 శాతం కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని వాపోయారు. ఈ అంశంపై తాము సెప్టెంబర్ 5వ తేదీన ధర్నా చేయనున్నట్టు వెల్లడించారు. బిహార్, ఈశాన్య భారతంలో వరదల కారణంగా 25 మంది మతి చెందారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.