Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11మంది మృతి, శిథిలాల్లో 40 మందికి పైగా..
ముంబయి: దశాబ్దాలనాటి నాలుగు అంతస్తులు భవనం కుప్ప కూలింది. ముంబయిలోని డోంగ్రీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో 11 మంది మరణించారు , ఆ భవన శిథిలాల కింద 40 నుంచి 50 మంది వరకూ చిక్కుకున్నారని సమాచారం. దక్షిణ ముంబయి లోని డోంగ్రీ ప్రాంతంలో వందేండ్లనాటి పురాతన భవనం ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ భద్రతా బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాదం ఇరుకైన ప్రాంతంలో కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. ఇప్పటివరకూ 11మృతదేహాలను బయటకు తీసినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు అధికారులు తెలిపారు. గాయపడిన ఎనిమిది మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి.