Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వ హించబడుతున్న ప్రతిష్టాత్మక సంస్థలైన ఎయిర్ పోర్టులను ప్రయివేటు సంస్థలకు అప్పగిం చడమేంటనీ సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎయిర్ పోర్స్ట్ ఎకనామిక్ రెగ్యులేటింగ్ అథారిటీ సవరణ బిల్లుపై మంగళవారం చర్చ జరిగింది. ఈసందర్భంగా కరీం బిల్లుపై మాట్లా డుతూ.. ప్రభుత్వ సంస్థల వృద్ధి కోసం సర్కారు ఆర్థికంగా సహకారం అందించాల్సింది పోయి, వాటిని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి
తీసుకెళ్ళడం సరికాదన్నారు. ప్రయివేటు శక్తుల చేతుల్లోకి వెళ్లాక.. ప్రతి అంశం వ్యాపారంగా మారబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటీకరణ జరిగితే ఆయా ప్రదేశాల్లో మంచినీటి సదుపాయం కూడా పట్టించుకోరని వివరించారు. మంచి నీటి వసతిని కూడా వ్యాపార దృక్పథంతోనే చూస్తారని సభకు తెలిపారు. కేవలం ఎయిర్ పోర్టులు మాత్రమే కాదనీ... దానితో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి కూడా రియల్ ఎస్టేట్ శక్తుల్లోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేల్లో కూడా ఇదే అంశంతో సర్కారు ముందుకు వెళ్లాలనుకోవటం సరికాదన్నారు. భారత ఎయిర్ పోర్టులు, రైల్వేలకు పెద్ద ఎత్తు భూములు ఉన్నట్టు చెప్పారు. ఆ భూములు సర్కారు ఆధ్వర్యంలోనే ఉండాలని అభిప్రాయ పడ్డారు. అందువల్లే ఈ బిల్లును సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు.