Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్పులేని తెలంగాణ గవర్నర్
- రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా ఒడిషాకు చెందిన సీనియర్ బీజేపీ నేత విశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. మంగళవారం ఈ మేరకు రాష్ట్రపతిభవన్ ఉత్తర్వులను జారీ చేసింది. 84 ఏండ్ల విశ్వభూషణ్ ఒడిషాలోని చిలిక, భువనేశ్వర్ నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. చిలిక నియోజకవర్గం నుంచి 1977, 1990ల్లో జనతా, జనతాదళ్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. భువనేశ్వర్ నియోజకవర్గం నుంచి 2000, 2004, 2014ల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 1934 ఆగస్టు 3న జన్మించిన ఆయన 1971 నుంచి భారతీయ జనసంఫ్ుకు సేవలు అందిస్తున్నారు. ఆ పార్టీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్మెంబర్, 1977లో జనతా పార్టీ ఏర్పడే వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అనంతరం బీజేపీ ఆవిర్భంచిన తర్వాత ఆయన అందులో చేరి 1980 నుంచి 88 వరకు రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. 1988లో మళ్లీ జనతా పార్టీలో ఆయన చేరారు. అందులో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1996 ఏప్రిల్ 4న మళ్లీ బీజేపీ తీర్థం పుచుకున్నారు. అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతూ వచ్చారు. బీజేడీి, బీజేపీ కూటమి ప్రభుత్వంలో న్యాయ, రెవెన్యూ, మత్య్స శాఖల మంత్రిగా ఆయన పని చేశారు. ఆయన ''మరు బటాస, రాణా ప్రతాప్, సేహ ఝాలక్, అష్టసిఖ, మనసి'' వంటి పుస్తకాలు రచించారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా విశ్వభూషణ్ ఎమర్జెన్సీలో నిర్బంధం సైతం ఎదుర్కొన్నారు. 2009 డిసెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ ఇక నుంచి తెలంగాణకు పరిమితం కానున్నారు.