Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీటీడీ చైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే ప్రముఖులకు కేటా యించే వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎల్1, ఎల్ 2, ఎల్3లను ఈ నెల17వ తేదీ (బుధవారం) నుండి రద్దు చేస్తున్నట్టు టీటీడీ చైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం
ఉదయం సుబ్బారెడ్డి ఈవో అనిల్కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా చైర్మెన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు తిరుమలకు విచ్చేసే ఎక్కువమంది సామాన్యభక్తులకు మరింత సౌకర్యవంతంగా, సులభంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా బ్రేక్ దర్శనంలో ఎల్1, ఎల్ 2, ఎల్3లను రద్దు చేస్తున్నామన్నారు.