Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్కు మందకృష్ణ వినతి
నవతెలంగాణ - ఖమ్మంటౌన్
సంక్షేమ హాస్టళ్లలో ఫైర్సేఫ్టీకి సంబంధించిన చర్యలు తీసుకుని విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ను బుధవారం ఆయన విద్యార్థినులతో కలిసి వెళ్లి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ ప్రమాదం జరిగిన హాస్టల్ను సందర్శించానని, అలాగే జిల్లాలోని పలు హాస్టళ్లలో అనేక సమస్యలను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఎన్నెస్పీ క్యాంపులోని ప్రభుత్వ స్థలాన్ని సంక్షేమ హాస్టల్స్ నూతన భవనాల నిర్మాణాల కోసం కేటాయించాలని కోరారు.హాస్టల్లో మృతి చెందిన బరపటి స్పందన కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.