Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాకౌట్ చేసిన వామపక్షాలు,
వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
వివాదాస్పద నేషనల్ ఇన్వేస్టిగేటివ్ ఏజెన్సీ సవరణ బిల్లును పెద్దల సభ ఆమోదం తెలిపింది. ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదం పొందినట్టు రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు సభలో ప్రకటించారు. కాగా, ఈ బిల్లు సోమవారం లోక్సభ ఆమోదించిన విషయం తెలిసిందే. బిల్లుపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మంగళవారం మాట్లాడారు. తీవ్రవాదులను తమ ప్రభుత్వం ఏ విధంగా ఉపేక్షింబోదన్నారు. దేశం అవతల ఉన్న తీవ్రవాదులను సైతం విచారించే హక్కును ఎన్ఐఏకి ఇచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80 తీవ్రవాద ఘటన సంబంధిత కేసులు నమోదు అయ్యాయని అన్నారు. వీటిపై ఎన్ఐఏ విచారణ చేపడుతుందన్నారు. అయితే, ఈ బిల్లుపై వామపక్షాలు, కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్, టీఆర్ఎస్, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లును సెలెక్ట్ కమిటీ పంపాలని, దానిపై ఉన్నటువంటి అభ్యంతరాలు తొలగిన తర్వాత ఆమోదించాలని వామపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమరం కరీం, కేకే రాగేష్, సీపీఐ ఎంపీలు బినరు విశ్వం, రాజా సభ నుంచి వాకౌట్ చేశారు.
హిందూత్వ శక్తులకు ఊతమిచ్చేలా ఎన్ఐఏ బిల్లు :కేకే రాగేష్
మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని, హిందూత్వ శక్తులకు ఊతమిచ్చే విధంగా మోడీ సర్కారు జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) సవరణ బిల్లును రూపొందిస్తుందని సీపీఐ(ఎం) ఎంపీ కేకే రాగేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మతానికి చెందిన ప్రజానీకాన్ని లక్ష్యం చేసుకొని చట్టాలు రూపకల్పన చేయడంపై ఆయన మండిపడ్డారు. బుధవారం రాజ్యసభలో ఎన్ఐఏ చట్ట సవరణ బిల్లు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) తరపున చర్చలో రాగేష్ పాల్గొన్నారు. సున్నితమైన బిల్లు సవరణపై సెలెక్ట్ కమిటీ స్క్రూటినింగ్ చేశాక, దాని సూచనలతో అవసరానికి తగిన విధంగా చట్టానికి తుది మెరుగులు దిద్దాలని సలహానిచ్చారు. తీవ్రవాదం రూపుమాపాలని వామపక్షాలతో పాటు పార్లమెంట్లో ఉన్న ప్రతి పార్టీ కోరుకుంటుందని స్పష్టం చేశారు. తీవ్రవాదానికి ఎవ్వరూ మద్దతునివ్వడం లేదన్నారు. కానీ, కొంతమంది అధికార పార్టీ నేతలు తమపై జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన అంశాలపై సర్కారుని నిలదీస్తే, ఏ విధంగా తాము యాంటీ నేషనల్స్ అవుతామన్నారు. హిందూత్వ శక్తుల ఆగడాలు దేశంలో రోజురోజుకి శృతి మించుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఐఏకి అపరిమిత అధికారాలు ఇవ్వడం సముచితం కాదన్నారు. జాతీయ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. కానీ, దాని పేరుతో ప్రభుత్వం తీవ్రవాద నిర్మూలనకు మత రంగు పులుముతున్నదని చెప్పారు. బిల్లు చట్టం రూపం దాల్చిన తర్వాత ప్రభుత్వాలు దుర్వినియోగం చేసే అవకాశం మెండుగా ఉంటుందని హెచ్చరించారు. ఈ పరిస్థితిని నిలువరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిజంగా తీవ్రవాద ఘటనల విచారణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే... మాలేగావ్ పేలుళ్ళ కేసు ఏమైందని అడిగారు. సంఝౌత ఎక్స్ప్రెస్ కేసు ఎందుకు పక్కన బెట్టారని నిలదీశారు. కేవలం ఒక మతానికి చెందిన కేసులపై దృష్టి పెట్టి.. ఇతర కేసులు పక్కనబెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూత్వపదంపై చైర్మెన్ అభ్యంతరం
హిందూత్వ పదం పలకవద్దని రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి రాగేష్ బదులిస్తూ... హిందూత్వ అనేది ఒక మతం కాదని చెప్పారు. తాను ఏ మతాన్ని సభలో ప్రస్తావించడం లేదన్నారు. కేవలం మతోన్మాదాన్ని మాత్రమే తప్పుబడుతున్నట్టు చెప్పారు. అది ఇస్లామిక్ టెర్రరిజమైనా... హిందూత్వ తీవ్రవాదమైన దేశ ప్రజానీకానికి నష్టదాయకమేని రాజ్యసభ చైర్మెన్కు రాగేష్ వివరించారు. రాగేష్ వాడిన ఇస్లామిక్, హిందూత్వ పదాలు రికార్డుల్లోకి వెళ్ళవని వెంకయ్యనాయుడు తెలిపారు.
సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదకరమే : టీఆర్ఎస్ ఎంపీ కెకె
నరేంద్రమోడీ సర్కారు ప్రవేశపెట్టిన ఎన్ఐఏ చట్ట సవరణ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి భంగం కల్గిస్తుందని టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ కే కేశవరావు తెలిపారు. రాష్ట్రాల హక్కులను ఈ బిల్లులోని చాలా అంశాలు కాలరాస్తున ా్నయని వివరించారు. ఎన్ఐఏ చట్ట సవరణపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.... దేశంలో నెలకొన్న ఒక ప్రత్యేక పరిస్థితిలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉనికిలోకి వచ్చిందని గుర్తు చేశారు. శాంతిభద్రతలు రాష్ట్రా లకు సంబంధించిన అంశమని గుర్తు చేశారు. దాంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతో కేంద్రం రాష్ట్రాల హక్కు లను హరించివేయటానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఇటు వంటి కీలక అంశాలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నప్పు డు కేంద్రం ఈ బిల్లును ఏ విధంగా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు.