Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-2 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఈనెలలోనే చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. ఈనెల 20 నుంచి 23 తేదీల మధ్య ఉపగ్రహాన్ని చంద్రుని మీదకు పంపనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. 'చంద్రయాన్-2 ప్రయోగానికి కొన్ని తేదీలను పరిశీ లిస్తున్నాం. బహుశా ఈ ప్రయోగం 20-23 తేదీల మధ్య ఉండొచ్చు' అని ఒక అధికారి వెల్లడించారు. ఈనెల 15న (సోమవారం) ఉదయం 2.51 గంటలకు శ్రీహరికోట నుంచి 'బాహుబలి' జీఎస్ఎల్వీ ఎంకే-3 రాకేట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఇస్రో ప్రయ త్నించింది. అయితే చివరి 56 నిమిషాలకు ముందు రాకెట్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పరీక్షను మధ్యలోనే ఆపేసిన విషయం తెలిసిందే. అయితే రాకెట్లో తలెత్తిన లోపాన్ని ఇస్రో ఇప్పటికే సవరించింది. దీంతో దేశం యావ త్తూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగం ఇస్రోకు తాజా సవాలుగా మారనున్నది.