Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంకేతాలిచ్చిన అమిత్షా
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉన్న అక్రమ వలసవాసులను గుర్తించి, అంతర్జాతీయ చట్టాల మేరకు వారిని వారి దేశాలకు తిప్పి పంపిస్తామని హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో తెలిపారు. అసోంలో అమలు చేస్తున్న తరహాలోనే జాతీయ పౌరసత్వ నమోదు కార్యక్రమం (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి)ని ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేస్తారా అని సమాజ్వాది పార్టీ సభ్యుడు జావేద్ అలి ఖాన్ అడిగిన ఒక అనుబంధ ప్రశ్నకు అమిత్షా పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు పర్యవేక్షణలో అసోంలో ఎన్నార్సీని నవీకరిస్తున్నారు. ఎన్నార్సీ తుది జాబితా ప్రకటించేందుకు ఈ నెల 31 తుది గడువు. అసోంలో ఎన్నార్సీ తుది జాబితాను ప్రకటించే చివరి తేదీని పొడిగించడంపై కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు ఈ సందర్భంగా తెలిపారు.
దాదాపు 25లక్షల మంది సంతకం చేసిన ఒక వినతి పత్రం తమకు అందిందని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని సరి చేసి తుది జాబితా రూపొందించాలని రాష్ట్రపతిని డిమాండ్ చేశారు. అసోంలో జరిపిన ఎన్నార్సీ కార్యక్రమంలో పలువురి పేర్లు తొలిగిపోయి , నకిలీ పేర్లు చోటు చేసుకున్నాయని మంత్రి చెప్పారు. దీని కోసం గడువు పొడిగించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఎటువంటి తప్పులు లేకుండా ఎన్నార్సీని అమలు చేయడంలో కొంత జాప్యమవుతున్నదని ఆయన తెలిపారు.