Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ ఆవరణలో వామపక్ష ఎంపీల ఆందోళన
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీ కరించొద్దని వామపక్ష ఎంపీిలు డిమాండ్ చేశారు. సర్కారు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉసంహరించొద్దని హెచ్చరించారు. నష్టాల పేరుతో ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి పంపడం దారుణమన్నారు. పీఎస్యూ లను ప్రయివేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం పార్లమెంట్ ఆవరణలో మహాత్మ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. లెఫ్ట్ ఎంపీలు చేస్తున్న ధర్నాకు ఆర్జేడీ ఎంపీి మనోజ్ కుమార్ ఝా, ఎన్సీపీి ఎంపీి మజిద్ మెమన్లు మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు చేతబట్టి పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. '''పీిఎస్యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి'' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ఎంపీి ఎలమారం కరీం మీడియాతో మాట్లాడారు. రైల్వే, బీఎస్ఎన్ఎల్, స్టీల్ ప్లాంట్లు, ఎయిర్ ఇండియా, రైల్వే ఉత్పాదక యూనిట్లు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ప్రయివేటీకరణ చేసేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. ప్రభుత్వం రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వం నిర్వహణలో ఉన్న పీిఎస్యూలను ప్రయివేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు. దీంతో ప్రజల ప్రయోజనాలకు తూట్లు పడతాయని అన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉపయోగించే రైల్వేను ప్రయివేటు పరం చేస్తే, సామాన్య ప్రజలపై భారాలు పెరుగుతాయని వివరించారు. ప్రతిదాన్ని సేవా దృక్పథంతో కాకుండా, వ్యాపారం దృక్పథంతో చూస్తారనీ, దీంతో ప్రజా సేవలు వ్యాపారమయమవుతాయని అన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల వద్ద అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయని గుర్తు చేశారు. వాటిని ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడం వల్ల జాతి సంపద దుర్వినియోగం అవుతుందని విమర్శించారు. పీిఎస్యూలను బలోపేతం చేయడంతో మోడీ సర్కార్ పూర్తిగా విఫలం చెందిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను పెంచేందుకు కాకుండా, నిర్వీర్యం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. ప్రజల ఆస్తి, ప్రయివేటు పరం కావడాన్ని వామపక్షాలు వ్యతిరేకిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టే ఆందోళనలకు వామపక్షాలు పూర్తి మద్దతు తెలుపుతాయని అన్నారు. ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) ఎంపీిలు టీకే రంగరాజన్, కేకే రాగేష్, జర్నాదాస్ బైద్య, ఎఎం ఆరీఫ్, పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేషన్, సీపీఐ ఎంపీలు డీ రాజా, కే సుబ్బరాయన్లు పాల్గొన్నారు.