Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సామరస్య పరిష్కారం చూపాలని ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ మధ్యవర్తిత్వం మరికొద్ది రోజులు మాత్రమే కొనసాగనుంది. ముగ్గురు సభ్యులతో కూడిన ఆ కమిటీ ఈ నెల 31 నాటికి సమగ్ర నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం వచ్చే నెల 2న ఈ కేసుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. చాలా ఏండ్లుగా నడుస్తున్న ఈ కేసులో ఇరువర్గాలకు సామరస్య పరిష్కారం చూపడానికి సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మార్చి 8న ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీని నియమించిన విషయం విదితమే. ఆ కమిటిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్.ఎం. ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, ప్రముఖ న్యాయవాది శ్రీరాం పంచూలను మధ్యవర్తిత్వ కమిటీలో నియమించింది. న్యూఢిల్లీ : వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సామరస్య పరిష్కారం చూపాలని ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ మధ్యవర్తిత్వం మరికొద్ది రోజులు మాత్రమే కొనసాగనుంది. ముగ్గురు సభ్యులతో కూడిన ఆ కమిటీ ఈ నెల 31 నాటికి సమగ్ర నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం వచ్చే నెల 2న ఈ కేసుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. చాలా ఏండ్లుగా నడుస్తున్న ఈ కేసులో ఇరువర్గాలకు సామరస్య పరిష్కారం చూపడానికి సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మార్చి 8న ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీని నియమించిన విషయం విదితమే. ఆ కమిటిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్.ఎం. ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, ప్రముఖ న్యాయవాది శ్రీరాం పంచూలను మధ్యవర్తిత్వ కమిటీలో నియమించింది.