Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: తమిళనాడులోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన కాంచీపురంలోని అత్తివరద రాజాస్వామి ఆలయంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయంలో ఈ నెల 1నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవి 48 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ క్రమంలో 18వ రోజైన గురువారాన్ని ఆలయానికి వచ్చే వారు పవిత్రంగా భావించారు. దాంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో క్యూలైన్లో ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన నారాయణమ్మ అనే మహిళ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.