Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమె సోదరుడికి చెందిన 400 కోట్ల విలువైన భూమి జప్తు
న్యూఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి ఆదాయ పన్ను(ఐటీ) శాఖ నుంచి ఎదురుదెబ్బ తాకింది. ఆమె సోదరుడు ఆనంద్ కుమార్కు చెందిన నోయిడాలోని రూ. 400 కోట్ల విలువైన ఏడెకరాల భూమిని ఐటీ అధికారులు అటాచ్ చేశారు. ఆనంద్, ఆయన భార్య విచితర్ లతకు చెందిన ప్రాపర్టీని జప్తు చేసినట్టు ఐటీ శాఖ విశ్వసనీయవర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఈ ఏడెకరాల భూమి 'బినామీ' గా పరిగణించిన ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. భూమి జప్తునకు సంబంధించి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే బినామీ నిరోధక విభాగం(బీపీయూ) ఈనెల 16న ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఐటీ అధికారులు ఆ పనిని పూర్తి చేశారు. బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా ఆనంద్ను గతనెలలోనే మాయావతి పునర్నియామకం చేసిన విషయం తెలిసిందే. బినామీ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి గరిష్టంగా ఏడేండ్ల వరకు కఠినశిక్ష లేదా బినామీ ఆస్థి మార్కెట్ విలువలో 25శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నది.