Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దాశరథి కృష్ణమాచార్య-2019 అవార్డును ప్రముఖ రచయిత కూరెళ్ల విఠలాచార్యకు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 306ను విడుదల చేసింది. ఈ అవార్డును దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఈ నెల 22న అందజేయనున్నట్టు యువజన సర్వీసులు, పర్యాటకం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రూ.1,01,116 నగదు పురస్కారంతో పాటు మెమెంటోను అందజేసి శాలువాతో సత్కరించనున్నట్టు పేర్కొన్నారు.