Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రివర్గ ప్యానెల్కు అమిత్ షా నేతృత్వం!
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా అమ్మకం, పెట్టుబడుల ఉపసం హరణకు సంబంధించి విధివిధానాలను రూపొం దించే మంత్రివర్గ బృందం(జీఓం)కు కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్షా నేతృత్వం వహించ నున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. అలాగే మంత్రివర్గ ప్యానెల్లో ఒక సభ్యుడిగా ఉన్న కేంద్ర రోడ్డు రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వైదొలగ నున్నట్టు సమాచారం. దీంతో గతంలో ఐదుగురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉండే ప్యానెల్లో నలుగురు మాత్రమే ఉండనున్నారు. ఎయిరిండియా స్పెసిఫిక్ అల్టర్నేటివ్ మెకానిజం (ఏఐఎస ్ఏఎం) పేరుతో ఎన్డీయే-1 పాలనలో కేంద్ర మంత్రులతో ఒక ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ఐదు గురు కేంద్ర మంత్రులు సభ్యులుండే ఈ బృందానికి అప్పటి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, బీజేపీ సీని యర్ నాయ కుడు అరుణ్ జైట్లీ నేతృత్వం వహించారు. ఈ ప్యానెల్లో ఆయనతో పాటు అప్పటి కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సురేశ్ ప్రభు, పీయూశ్గోయెల్, నితిన్ గడ్కరీలు ఉన్నారు. అయితే ఎన్డీయే-2 పాలనలో జైట్లీ కేంద్ర మంత్రిగా లేకపోవడంతో మోడీ సర్కారు మంత్రి వర్గ ప్యానెల్లో మార్పులు చేసింది. తాజా ప్యానెల్లో షాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్, రైల్వే శాఖ మంత్రి పీయూశ్గోయెల్, పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలు ఉండనున్నారు. కాగా, పార్లమెంటు సమావేశాల ముగింపు అనంతరం ఏఐఎస్ఏఎం ప్యానెల్ త్వరలోనే సమావేశం కానున్నట్టు తెలుస్తున్నది.