Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్గా బిశ్వ భూషణ్ హరిచందన్ను నియమించగా.. తాజాగా తెలంగాణలో కూడా గవర్నర్ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గవర్నర్ మార్పు నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయినట్టుగా చర్చ నడుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించబోతున్నట్టు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకుని.. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి నరసింహనే తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగుతూ వస్తున్న విషయం విదితమే. ఇటీవల ఏపీకి కొత్త గవర్నర్ను నియమించగా.. తాజాగా తెలంగాణలో కూడా ఆ మార్పు కచ్చితంగా జరుగుతుందని భావిస్తున్నారు. ఈమేరకు గురువారం రాత్రి జాతీయ మీడియాలో కూడా ప్రచారం చోటుచేసుకుంది. కాగా కేంద్రం పరిశీలనలో పలుపేర్లు ఉన్నాయని సమాచారం. మాజీ కేంద్ర మంత్రి సుష్మారాజ్, మాజీ ఐపీఎస్ అధికారి, పాండిచ్ఛేరి లెఫ్టీనెంట్ గవర్నర్గా ఇప్పటికే విధుల్లో ఉన్న కిరణ్బేడీ తదితర పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గురువారం సాయంత్రం జరిగిన సీఎం, గవర్నర్ భేటిలో ఈవిషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది.