Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యురాలి ధీటైన సమాధానం
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్షాకు సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యురాలు షాకిచ్చారు. త్రిపుర ఎంపీ జర్నాధాస్ ఆయనకు ఇచ్చిన సమాధానానికి హౌం మంత్రి విస్తుపోక తప్పలేదు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... త్రిపురలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ, ప్రచార కార్యక్రమంలో లెఫ్ట్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ హింసాత్మక దాడులకు పాల్పడుతున్న విషయం బహిరంగ రహస్యమే. కాగా, కేంద్ర హోం మంత్రికి వినతిపత్రం సమర్పించేందుకు సీపీఐ(ఎం) ఎంపీ జర్నాధాస్ ఆయన అపాయింట్మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయనను కలిసేందుకు అమిత్షా కార్యాలయానికి వెళ్ళారు. 'మీరు ఇంకా సీపీఐ(ఎం)లో ఎందుకు కొనసాగుతున్నారు. మీరు మాతో కలిసి పనిచేయండి.. బీజేపీలో చేరండి' అంటూ ఆయన జర్నాధాస్ను కోరారు. 'బీజేపీ అధ్యక్షుడితో మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. మీరు హోంశాఖ మంత్రి అయినందునే నేను ఇక్కడకు వచ్చాను. నేను మీకు మరో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. నేను ఎప్పటికీ సీపీఐ(ఎం) పార్టీలోనే కొనసాగుతాను.. మీరు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరంలేదు' అని అమిత్షాకు జర్నాదాస్ ధీటైన సమాధానం ఇచ్చారు. ఆమె సమాధానంతో షాక్ తిన్న షా.. మారు మాట్లాడకుండా వినతిపత్రం స్వీకరించి మౌనంగా ఉండిపోయారు.