Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన అంత్యక్రియలు
- పలువురి సంతాపం
న్యూఢిల్లీ: గుండెపోటుతో మృతి చెందిన ఢిల్లీ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఆమె అంత్యక్రియలకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, అనుచరులు, బంధువులు భారీ సంఖ్యలో హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. సందర్శనార్థం ఆమె బౌతికకాయాన్ని ఆదివారం ఉదయం కాంగ్రెస్ కార్యాలయానికి తరలించారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్, ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్ సహా పలువురు నాయకులు ఆమెకు నివాళులర్పించారు. షీలా దీక్షిత్తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని సోనియా గాంధీ, షీలా ఇచ్చిన సలహాలు, సూచనలను ప్రియాంక గాంధీ ట్విట్టర్లో గుర్తుచేసుకున్నారు.