Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక బల్బు, ఫ్యాను వాడితే రూ.128 కోట్ల బిల్లు
- యూపీలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..
లక్నో: పరిశ్రమలకు విద్యుత్ వాడితే లక్షల్లో.. కోట్లల్లో బిల్లు వస్తుంది. గృహాలకు అయితే వందల్లో.. వేలల్లో వస్తుంది. కానీ ఒక బల్బు, ఫ్యాను వాడటంతో రూ.128కోట్ల బిల్లు రావడంతో ఓ నిరుపేదకు దిమ్మదిరిగింది. ఇది ఉత్తరప్రదేశ్ విద్యుత్లో నిర్వాకమిది. యూపీలోని హాపూర్ పరిధిలోని ఛామ్రీ గ్రామానికి చెందిన షామీమ్ అనే నిరుపేదకు ఏకంగా రూ.128 కోట్ల విద్యుత్ బిల్లును ఆ రాష్ట్ర అధికారులు వేశారు. బిల్లు కట్టాల్సిన గడువు దాటి పోవడంతో విద్యుత్ కనెక్షన్ కట్చేశారు. బిల్లుమొత్తం కట్టాలని అధికారులు అదేశించారు. బిల్లును చూసి విస్తుపోయిన బాధితుడు విద్యుత్ అధికారులను 'ఇంత బిల్లు ఎలా వచ్చిం ది, ఎలా కట్టాలో చెప్పాలని' కోరాడు. దీనికి ఎంతమాత్రమూ స్పందించని అధికారులు రూ.128 కోట్లు కట్టితీరాలని, లేకపోతే విద్యుత్ కనెక్షన్ తిరిగి ఇవ్వమని తేల్చి చెప్పారు. ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డ షామీమ్ మీడియాను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
'మా ఇంట్లో నేను, నాభార్య ఉంటాం. ఒక లైటు, ఒక ఫ్యాను ఉపయోగించు కుంటాం. మేం నెల మొత్తం 2కిలో వాట్స్కి మించి వాడం. వాటికి ఎంత ఎక్కువ వేసినా బిల్లు రూ.200 దాటదు. కానీ రూ.128 కోట్లు మేం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెల్లించాలి?. నాసమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్లు పట్టించుకోలేదు. మొత్తం బిల్లు కట్టితీరాల్సిందేనని నోటీసులు పంపారు. ఇది నాఇంటి వరకే వచ్చినట్టు లేదు. రాష్ట్రంమొత్తం బిల్లు నాతోనే కట్టించాలనుకు న్నారేమో. నాకు న్యాయం చేయండి' అని షామీమ్ వేడుకున్నాడు. దీనిపై విద్యుత్ శాఖ ఇంజినీర్ రామ్ శరణ్ను వివరణ కోరగా సాంకేతిక లోపాల కారణంగా అలా వచ్చి ఉండొచ్చని నిర్లక్ష్యంగా స్పందించడం గమనార్హం.