Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన భార్య తజీన్ ఫత్మా
లక్నో : యాంటీ ల్యాండ్ మాఫియా పోర్టల్లో ఆజంఖాన్ పేరును చొప్పిస్తూ డజనుకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని.. ఇది యూపీ సర్కారు, బీజేపీ రాజకీయ కుట్రలో భాగమని ఆయన భార్య, రాజ్యసభ సభ్యురాలు తజీన్ ఫత్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో ఉప ఎన్నికలకు ముందు ఆజంఖాన్పై యోగి సర్కారుతో పాటు రాంపూర్ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. జిల్లా మేజిస్ట్రేటు అవుజనేయ కుమార్ సింగ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) అజరు పాల్ శర్మ లు తమ విధులను సరిగ్గా నిర్వర్తించడంలేదని, ఎస్పీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి యోగి సర్కారును సంతోషపరిచేలా వారి చర్యలున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన 11 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికల కోసం సెప్టెంబరులో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ఇందులో ఆజంఖాన్ రాజీనామా చేసిన రాంపూర్ అసెంబ్లీ స్థానం కూడా ఉన్నది. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన ఆజంఖాన్.. లోక్సభ ఎన్నికల్లో భాగంగా సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి జయప్రదపై ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.