Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు వారాల సమయం కోరిన కేంద్రం
న్యూఢిల్లీ: బోంబే హైకోర్టు న్యాయమూర్తి ఎఎ. కురేషీ పదోన్నతి పరీశీలనలో ఉన్నదని, తమ స్పందన తెలిపేందుకు రెండు వారాల సమయం కావాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. జస్టిస్ కురేషీకి మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం రెండు నెలల క్రితం సిఫారసు చేసింది. అందుకు అనుగుణంగా నియామకం చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని గుజరాత్ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్మెహతా సుప్రీంకోర్టును సమయం కోరారు.
అడ్వొకేట్స్ తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్.నారిమన్ వాదిస్తూ మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంవోపీ) ప్రకారం ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిల నియామకంలో కేంద్రం పాత్ర ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయడానికే పరిమితమని స్పష్టం చేశారు. కొలీజియం సిఫారసుకు అనుగుణంగా నియామకాలు చేపట్టాల్సింది న్యాయశాఖ అని ఆయన తెలిపారు. ఎంవోపీకి అనుగుణంగా గుజరాత్ ప్రభుత్వం నుంచి అభిప్రాయం తీసుకున్నారా అనేది సుప్రీంకోర్టుకు తెలపాలని కేంద్రానికి నారిమన్ సూచించారు. జస్టిస్ కురేషీ గతంలో గుజరాత్ హైకోర్టు జడ్జిగా పని చేశారన్నది గమనార్హం. ఇరుపక్షాల వాదన విన్న చీఫ్ జస్టిస్ రంజన్గొగోరు నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. జస్టిస్ కురేషీ పదోన్నతి విషయంలో కేంద్రం కావాలనే తాత్సారం చేస్తున్నదనే విమర్శలున్నాయి. జస్టిస్ కురేషీకి పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం మే 10న సిఫారసు చేసింది. ఎంవోపీకి అనుగుణంగా జస్టిస్ కురేషీకి పదోన్నతి కల్పించకపోవడానికి కేంద్రానికున్న అయిష్టతే కారణమని అడ్వొకేట్స్ అసోసియేషన్ విమర్శిస్తోంది. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై కేంద్ర ప్రభుత్వ దాడిగానే వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కేంద్ర హౌంమంత్రి అమిత్షా 2010లో జస్టిస్ కురేషీ ఆదేశాల మేరకు జైలుకెళ్లిన విషయాన్ని అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యతిన్ ఓజా గుర్తు చేశారు.