Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా/గౌహతి : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు బీహార్, అస్సాం రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. భారీ వర్షాలు, వరదలు దాదాపు కోటీ 10 లక్షల మందిపై ప్రభావం చూపాయి. పలువురు మృత్యువాతబడగా, పెద్దఎత్తున ఆస్తినష్టం కూడా జరిగింది. ఆదివారం నాటికి రెండు రాష్ట్రాల్లో ఈ వరదల ధాటికి 166 మంది చనిపోయినట్లు అధికారికవర్గాల అంచనా. వీరిలో అస్సాంకు చెందిన వారు 64 మంది ఉండగా, బీహార్కు చెందిన వారు 102 మంది ఉన్నారు. ఈ వర్షాలకు బీహార్లో 12 జిల్లాల్లోని 72 లక్షల మందిపైగా , అస్సాంలోని 18 జిల్లాల్లో 38 లక్షల మందిగా ప్రభావితులయ్యారు. బీహార్లోని ఒక్క ముధబని జిల్లాలోనే మృతుల సంఖ్య 23కు చేరింది.