Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తాను కూడా ఈ దేశ పుత్రికనే అని, తనకు ప్రభుత్వం శాశ్వత నివాస అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్టు బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ తెలిపారు. ప్రతి సంవత్సరం నివాస అనుమతి కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకుంటే బాగుంటుందని ఆమె అన్నారు. నస్రీన్కు భారత్లో నివాసముండేందుకు మరో ఏడాదిపాటు అనుమతి ఇస్తున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు ఆదివారం తెలిపాయి. దీనిపై నస్రీన్ సోమవారం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అధికారులు తనకు శాశ్వత నివాస అనుమతి ఇస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 5 లేదా 10 సంవత్సరాలకు ఒకసారి ఈ నివాస అనుమతిని కూడా జారీ చేసే అవకాశం ఉందన్నారు. భారత్లోనే తన శేష జీవితం గడపాలనుకుంటున్నాననీ, అందుకుఅనుమతి ఇవ్వాలని 2014లోనే అప్పటి హోంమంత్రి రాజ్నాధ్సింగ్ను కోరినట్టు తెలిపారు.