Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుల్లో తండ్రీ కొడుకులు, ఒకరు మైనర్
భోపాల్ : సభ్య సమాజం సిగ్గుపడేలా.. తండ్రి, కొడుకులు, మరో నలుగురు వ్యక్తులు ఓ మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చేటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఇండోర్లోని ఓ బాలిక (16) తన తల్లి చనిపోవడంతో చదువు మానేసి.. పొట్ట కూటి కోసం ఓ ఫుడ్ కాంట్రాక్టర్(50) వద్ద పనిలో చేరింది. ఆ పని నచ్చకున్నా అక్కడి నుంచి వెళ్లలేని దీనపరిస్థితి. ఇదే అదనుగా భావించిన ఆ ఫుడ్ కాంట్రాక్టర్, అతని కొడుకు, మరో నలుగురు వ్యక్తులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకోలేక ఆ బాలిక దాదాపు 16 నెలల పాటు నరకయాతన అనుభవించింది. ఈ క్రమంలో ఓ సన్నిహితురాలు నుంచి ఫోను తీసుకోని.. అసలు విషయాన్ని తన తండ్రికి వివరించింది. దీంతో ఆమె తండ్రి పోలీసులును ఆశ్రయించారు. వారి ఫిర్యాదు ఆధారంగా ఆ కాంట్రాక్టర్ను, అతని కొడుకును మరో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో ఒకరు మైనరు కావడం గమనార్హం