Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి ఎంటీఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
ముంబయి : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెనుప్రమాదం తప్పింది. నగరంలోని బాంద్రా ప్రాంతంలోని ఎంటీఎన్ఎల్ టెలిఫోన్ ఎక్సేంజీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 3, 4వ అంతస్తుల్లో జరిగిన ఈ ప్రమాదంతో భవనమంతా దట్టమైన పొగ ఆవరించింది. దీంతో అక్కడ ఉన్న దాదాపు 100 మంది ఉద్యోగులు, ఇతరులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ నుంచి భవనంలోని పైఅంతస్తులకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 14 వాహనాలతో అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. అనంతరం వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. భవనంలో చిక్కుకున్న వారిని క్రేన్ సాయంతో సురక్షితంగా కిందకు దించారు. దీంతో పాటు అగ్నిమాపక సిబ్బంది భవనంలోకి ప్రవేశించి ఆయా అంతస్తులో ఉన్న వారందరికీ సురక్షితంగా ఖాళీ చేయించారు. సహాయక చర్యల్లో రోబోట్ వాహనాలు కూడా పాల్గొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.