Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ వసతిగృహంలో మైనర్లపై...విచారణ చేపట్టిన ఒడిశా చైల్డ్ వెల్పేర్ కమిటీ
భువనేశ్వర్: దేశంలో రోజురోజుకూ మహిళలకు రక్షణ కరువవుతున్నది. చిన్నాపెద్ద తేడా లేకుండా ఆడ అయితే చాలు వారిపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. వారి మనుగడే నేడు ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. చివరకూ హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులను కూడా వారు వదలటం లేదు. ప్రభుత్వ సహాయక కేంద్రాల్లోనే మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒడిశాలోని ప్రభుత్వ వసతీ గృహంలో చోటుచేసుకుంది. కలహండిలోని ప్రభుత్వ వసతీ గృహంలో ఉంటున్న తన 8 ఏండ్ల కుమార్తెతో పాటు మరికొందరిపై షెల్టర్ హెమ్ సూపరిండెంట్ సరోజ్ దాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా బాధిత బాలిక తల్లి ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దష్టికి వెళ్లింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దీనిపై విచారణకు ఆదేశించింది. కమిటీ అధికారులు మంగళవారం అక్కడి ఉద్యోగులను విచారించారు. దీనిపై పూర్తి విచారణ జరుపనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందం దీనిపై విచారణను ప్రారంభించింది, త్వరలోనే నిజానిజాలను వెలికితీస్తామని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక 2016 ఆగస్టు నుంచి షెల్టర్ హౌమ్లోనే ఉంటున్నది. అక్కడ ఇలాంటి దారుణ పరిస్థితులు ఉండటంతో.. తన బిడ్డను ఈ ఏడాది మార్చి 25న బాలికతల్లి ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం లైంగిక వేధింపుల విషయాన్ని మీడియాకు తెలిపారు.