Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్: మలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఎన్నికయ్యింది టాయిలెట్లు శుభ్రం చేయడానికి కాదంటూ వ్యాఖ్యానించారు. ప్రగ్యాసింగ్ తాజాగా తన నియోజకవర్గంలో పర్యాటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానికులు, పార్టీకార్యకర్తలూ ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఓ కార్యకర్త తమ ప్రాంతంలోని సమస్యలను ఆమె దృష్టి తీసుకువెళ్లారు, తమ ప్రాంతలో టాయిలెట్లు, డ్రయినేజీ వ్యవస్థ సరిగా లేదని ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ప్రగ్యాసింగ్.. టాయిలెట్లు, డ్రయినేజీలు క్లీన్ చేసేందుకు ఎంపీని కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.'' మేము ఎన్నికయ్యింది ఇలాంటి నీచమైన పనులు చేయడానికి కాదు. బాధ్యతయుతంగా, నిజాయితీగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, ఎమ్మెల్యేలను, మున్సిపాల్ కార్పొరేటర్లను, స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేయడం మా బాధ్యత'' అని అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ కూడా చీపురు పట్టి ఊడ్చిచారు. కానీ ఆమె ఇలాంటి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.