Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక అసెంబ్లీలో ఉత్కంఠ
- సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్
- ఆరు గంటలకు విశ్వాస పరీక్ష
- కుమార స్వామి భవితవ్యం తేలనుందా..?
బెంగళూరు, న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా సాగుతున్న కర్నాటక ప్రతిష్టంభన సోమవారం క్లైమాక్స్కు చేరింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష చర్చ ముగింపు దశకు చేరుకుంది. తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ సభ్యులు ఆందోళన చేస్తుండగా రాత్రి 11.40గంటల సమయంలో స్పీకర్ రమేష్కుమార్ మంగళవారానికి సభను వాయిదా వేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బలపరీక్ష నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. స్పీకర్ ఈప్రకటన చేసిన సమయం లో సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు లేరు. అంతకుముందు భోజనానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ కత్తి తిరిగి రాకపోవడంతో ప్రతిపక్ష బీజేపీ శిబిరంలో అలజడి రేగింది. ఆయనను వెతకడం కోసం మరో బీజేపీ ఎమ్మెల్యే బొమ్మై బసవరాజు వెళ్లారు. విశ్వాస పరీక్షపై సభ్యులందరూ మాట్లాడాక గురువారం ఓటింగ్ నిర్వహిద్దామని స్పీకర్ రమేష్ కుమార్ చేసిన సూచనను ప్రతిపక్ష బీజేపీ తిరస్కరించడంతో సభలో కొద్దిసేపు ఉద్వి గత నెలకొంది. చర్చ ముగిసాక ఓటింగ్ జరపాల్సిందేనని, దీనిపై ఇంకెంత మాత్రం జాప్యం తగదని బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. రాత్రి 11.30 గంటల వరకూ ఓటింగ్పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం విశ్వాస తీర్మానంపై చర్చ జరిగే ముందు స్పీకర్ సీఎల్పీ నాయకుడు శక్రవారం లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్పై రూలింగ్ ఇస్తూ సీఎల్పీ నాయకుడికి విప్ జారీచేసే అధికారం ఉందని చెప్పారు. రాజకీయ పార్టీల హక్కును కాలరాసే ప్రయత్నం తాను చేయబోమని చెప్పారు. ఆతరువాత మంత్రి కృష్ణ బైరేగౌడ మాట్లా డుతూ.. గత 14నెలల్లో కర్ణాటకలో కర్నాటకలో అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీి చేసిన కుటిల ప్రయత్నాలను, శాసనసభ్యుల కొనుగోళ్లను సవివరంగా ప్రస్తావించి నైతికత గురించి బీజేపీ చెప్పేది వట్టి బూటకమని ఎండగట్టారు. విధానసభ భోజన విరామానికి వాయిదా పడే వరకు కృష్ణ బైరేగౌడ తమ పార్టీ శాసన సభ్యులను ముంబయికి ఎవరు తరలించారో, ఏయే విమానాల్లో తరలించారో ఉదాహరణలతో పోస్టర్లను, ఆధారాలను ప్రదర్శించారు. తమ శాసనసభ్యుల రాజీనామా ఇంకా అంగీకారం కాకపోవటంతో వారంతా కాంగ్రెస్ జేడీిఎస్ పార్టీల సభ్యులని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుల రాజీనామాలపై స్పష్టత వచ్చేవరకూ విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కోరారు. భోజన విరామం తరువాత సమావేశమైన శాసనసభ తమకు తీర్మానంపై చర్చించేందుకు తగినంత సమయం కేటాయించాలని స్పీకర్కు మనవిచేశారు. ఈమధ్యలో స్పీకర్ను రెండుసార్లు కలుసుకున్న ముఖ్యమంత్రి కుమారస్వామి తనకు మరో రెండురోజులు గడువు కావాలని, ఆ తరువాతనే బలపరీక్ష జరుపుదామని మనవి చేశారు. రాత్రి 9.00గంటల్లోపు సభను ముగించి బలపరీక్ష జరుపుతానని స్పీకర్ పట్టుబట్టారు. గత శుక్రవారం తాను సభలో వచ్చే సోమవారం విశ్వాసపరీక్షపై చర్చను పూర్తిచేసి బలపరీక్షకు అనుమతి స్తామని చెప్పినట్టు గుర్తు చేశారు. దీనిని అమలు చేయకపోతే మాట తప్పినవాడిని అవుతానని స్పీకర్ చెప్పారు. స్పీకర్ నిర్ణయం ప్రకటిం చేటప్పుడు పాలకపక్షాల సభ్యులు నినాదాలు ఇస్తూ చర్చపై తమకు అను మతి ఇచ్చి న్యాయం కల్పించాలని నినాదాలు ఇచ్చారు. స్పీకర్ వెల్లో ధర్నా చేశారు. దీంతో స్పీకర్ సభను 10నిమిషాలపాటు వాయిదా వేశారు. తరువాత రాత్రి 8.30గంటలకు సమావేశాలు ప్రారంభమ య్యాయి. వెంటనే ప్రతిపక్ష నాయకుడు యడ్యూరప్ప సోమవారం అర్ధరాత్రి 12.00 గంటల వరకు సమావేశం జరిపి తీర్మానంపై బలపరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ తాను సీఎం కుర్చీకు అంటుకుని కూర్చోలేనని, కర్నాటకలో బీజేపీ జరిపిన అసహ్యకర రాజకీయాల గురించి సంపూర్ణంగా చర్చ జరగాలనే సభను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. చివరకు స్పీకర్ జోక్యం చేసుకుని మంగళవారానికి వాయిదా వేశారు.
విశ్వాస పరీక్ష నేటికి వాయిదా..
బలపరీక్ష నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని స్పీకర్ రమేశ్ను కోరారు. సీఎం, కాంగ్రెస్ సభ్యుల విజ్ఞప్తుల మేరకు స్పీకర్ బలపరీక్షను మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని అధికార పక్షానికి డెడ్ లైన్ విధించారు. రాత్రి 8 గంటలవరకు సమయం ఇవ్వాలని సిద్ధరామయ్య కోరారు. అందుకు స్పీకర్ తిరస్కరించారు. 4 గంటలకు చర్చను ముగించి.. సాయంత్రం 6 గంటలకు విశ్వాస పరీక్షను నిర్వహిస్తామని స్పీకర్ తేల్చి చెప్పారు.