Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దుల్లో విధులు నిర్వర్తించని విభాగాల్లో 27 వేల మందిని ఇంటికి పంపే యత్నం
- ఖర్చు తగ్గించుకునే యోచనలో కేంద్రం
- ఇప్పటికే ప్రతిపాదనలు.. ఆదేశాలే తరువాయి
జై జవాన్..జైకిసాన్ అంటూ గత పాలకులు నినదిస్తే..ఈ రెండింటినీ దెబ్బతీసేలా మోడీ సర్కార్ అడుగులేస్తున్నది. ఇప్పటికే అన్నదాతలు రోడ్లపైకి ఎక్కుతుంటే...తాజాగా సైనికులను ఉద్వాసన పలికేలా అంతర్గత ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. తమ ప్రాణాలనూ లెక్కచేయకుండా..దేశం కోసం అహర్నిశలు పాటుపడేవారు ఎవరైనా ఉన్నారంటే సైనికులే అనటంలో ఏమాత్రం సందేహంలేదు. ఎండ,వాన,చలి ఇలా ఏ వాతావరణం అయినా దేశభద్రత కోసం తెగించటానికి సిద్ధంగా ఉంటారు. ఇపుడు ఆ సైనికుల జీవితాలతోనూ బీజేపీ సర్కారు ఆటలాడుకోబోతున్నదని సమాచారం. సరిహద్దుల్లో విధులు నిర్వర్తించని విభాగాల్లో ఉన్న 27వేలమందిని తొలగించాలని నిర్ణయించేసింది. దీంతో సైనికుల కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
న్యూఢిల్లీ : సైనికులు, వారి త్యాగాల గురించి గొప్పలు చెప్పే కేంద్రంలోని మోడీ సర్కారు.. ఆర్మీలో 27 వేల మంది సైనికులను తొలగించడానికి సిద్ధమైనట్టు సమాచారం. రెండోసారి అధికారాన్ని చేపట్టాక ప్రభుత్వరంగ సంస్థలన్నిం టినీ ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తున్న మోడీ సర్కారు.. ఇప్పటికే రక్షణ రంగానికి ఆయుధాలు సమకూర్చే ఆయుధ కర్మాగారాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో కాకుండా ప్రత్యేక విభాగాల్లో విధులు నిర్వర్తించే (నాన్కోర్ యూనిట్స్) సైనికులకు ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తున్నది. విశ్వ సనీయ వర్గాల సమాచారం మేరకు.. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్మీ ప్రతిపాదనలు పంపిందనీ, కేంద్రం నిర్ణయమే తరువాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్మీలో సంస్కరణల పేరిట ఈ నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేస్తున్నా అందులో ఎక్కువశాతం సైనికుల జీతాలకే ఖర్చవుతున్నాయనీ, వాటిని తగ్గించుకునేందుకేనని సంస్కరణలు తెస్తున్నామని కేంద్రం అంటున్నది. వాస్తవానికి ఇది సైనికుల భారాన్ని తగ్గించు కోవడమేనని సైనిక కుటుంబాలు వాపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 12.5లక్షల మంది సైనికులున్నారు. వీరిలో 1.75 లక్షల మంది ప్రత్యక్షంగా సైనిక విధుల్లో లేరు. వీరందరూ మిలిటరీ ఇంజినీర్స్ సర్వీసెస్, నేషనల్ కెడెట్ కాప్స్ (ఎన్ సీసీ), బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో), టెరిటోరియల్ ఆర్మీ అండ్ సైనిక్ స్కూల్స్ వంటి ప్రత్యేక విభాగాల్లో అధికారులు, ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, వీరిలో 27 వేల మందికి ఉద్వాసన పలకనున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆర్మీ హెడ్క్వార్టర్స్ నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు కూడా అందాయనీ, దీనికి సంబంధించిన దస్త్రాలు ప్రస్తుతం రక్షణశాఖ వద్ద ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ విషయంలో కేంద్రం అతి త్వరలోనే ఆదేశాలు (కాస్ట్ కటింగ్) జారీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. 'కొత్త నియామకాలు అంతంతమాత్రంగానే జరుగుతు న్నాయి. వారికిచ్చే జీతాలూ తక్కువగానే ఉంటు న్నాయి. ఈ విషయాలను మోడీ సర్కారు పరిగణన లోకి తీసుకుని సైనికుల ఉద్యోగులకు ఎసరు పెడుతున్నద'ని ఆయన ఆరోపించారు. 27 వేల మంది సైనికులను తీసేయడం ద్వారా రాబోయే ఐదారేండ్లలో సుమారు రూ. 6 వేల కోట్ల వరకు మిగుల్చుకోవడానికే రక్షణ శాఖ ఈ ప్రతిపానలు సిద్ధం చేస్తున్నదని విమర్శించారు.
రక్షణ శాఖ కేటాయింపుల్లో 83 శాతం సైనికుల జీతభత్యాలు, రోజూవారి ఖర్చులకే పోతున్నదనీ, కొత్త ఆయుధ సామాగ్రి, సాంకేతికతను అంది పుచ్చుకునేందుకు ఆర్మీ వద్ద సరైన నిధులు అందుబాటులో లేవని కేంద్రం వాదనగా ఉన్నది. అయితే, అదే సమయంలో సీనియర్ స్థాయిలో ఉండే అధికారుల కొరత ఉన్నదనీ, లెఫ్ట్నెంట్ ర్యాంకుల వివాదంతో కేంద్రం ఆ అధికారులను నియమించేం దుకు మీనమేషాలు లెక్కిస్తున్నదని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా సరిహద్దుల్లో విధులు నిర్వర్తించని సైనికులను తొలగించాలనే ప్రతి పాదనలతో ఆ కుటుంబాలన్ని రోడ్డున పడుతాయనీ, దీనిపై పునరాలోచన చేయాలని వారంతా కేంద్రానికి సూచిస్తున్నారు.
దాడికి సిద్ధం..
జమ్మూకాశ్మీర్లో 370వ అది రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో దాయాది దేశం లడఖ్ సరిహద్దుల్లో యుద్ధ విమానాలు ఉంచిందన్న వార్తల నేపథ్యంలో దాడి చేసేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతిదేశం సరిహ ద్దుల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటుందనీ, దానికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఒకవేళ పాక్ దాడికి దిగితే దానికి ప్రతిదాడి చేసేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఇందుకోసం అవసరమ య్యే సైనికులను ఇప్పటికే సరిహద్దుల్లో ఉంచామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కదలికపై ఓ కన్నేసి ఉంచామని ఆయన స్పష్టం చేశారు.
- బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్