Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ ఏ ఖురేషి పదోన్నతిపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కురేషి పదోన్నతి పరిశీలనలో ఉందనీ, తమ స్పందన తెలపడానికి మరోవారం రోజుల గడువు కావాలని కేంద్రం సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. జస్టిస్ ఖురేషికి మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం రెండు నెలల క్రితమే సిఫారసు చేసింది. ఈ అంశంపై కేంద్రం తన నిర్ణయం తెలపకుండా ఇప్పటికే అనేక సాకులూ చెప్పుతూ తన నిర్ణయాన్ని దాటావేస్తు వస్తుంది. సిఫారసుకు అనుగుణంగా నియామకం చేపట్టాలా కేంద్రాన్ని ఆదేశించాలని గుజరాత్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచార ణలో కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లా డుతూ.. జస్టిస్ ఖురేషిని పదోన్నతి విషయంలో కేంద్రానికి మరింత సమ యం కావాలని కోరారు. వారం రోజుల్లోగా కేంద్రం తన నిర్ణయాన్ని కొలీజి యానికి తెలుపుతుందన్నారు. అతని వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వారంలోగా పదోన్నతిపై సరైనా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. గతంలోనూ ఈ విషయంపై కేంద్రం పలుమార్లు వాయిదాలు కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే.