Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ ముందుకు టీఎంసీ మంత్రి పార్థా ఛటర్జీ
కోల్కతా: శారదా, రోజ్వ్యాలీ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే తణ మూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రె టరీ పార్థా ఛటర్జీ, కోల్కతా మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం ప్రశ్నించింది. శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు, తణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక 'జాగో బంగ్లా'కు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఛటర్జీని సీబీఐ ప్రశ్నించినట్టు సమాచారం. ఛటర్జీ జాగో బంగ్లాకు సంపాదకులుగా ఉన్నారు. అలాగే ప్రస్తుతం కోల్కతా సీఐడీ విభాగానికి ఏడీజీగా పనిచేస్తున్న రాజీవ్ కుమార్ను రోజ్ వ్యాలీ పోంజీ కుంభకోణానికి సంబంధించి విచారణకు పిలిచినట్టు తెలుస్తున్నది.