Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూకదాడిలో మరణించిన వ్యక్తి తండ్రి ఆత్మహత్య
జైపూర్: గతనెలలో రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో జరిగిన మూకదాడిలో మరణించిన వ్యక్తి తండ్రి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 16న అల్వార్లో హరీష్ జాతావ్ అనే దళిత యువకుడు తన బైక్తో అనుకోకుండా ఓ మహిళను ఢ కొట్టాడు. దీంతో ఆగ్రహించిన స్థానిక మూక అతనిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచి హతమార్చారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి.. మృతుడి తండ్రి రతిరామ్కి స్థానికమూక నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నాడనీ, అదేవిధంగా ఈ కేసు దర్యాప్తులో పోలీసుల తీరు కూడా అసంతప్తిగా ఉందనీ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రోజురోజుకు మూక వేధింపులు తీవ్రతరం కావడంతో మనస్థాపానికి గురైన రతిరామ్ గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో ఆయనను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో.. చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపౖౖె ఆగ్రహానికి లోనైన మృతుడి బంధువులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.