Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలవరంకు రివర్స్ టెరడర్ నోటిఫికేషన్ జారీ
- సెప్టెంబరు 19వ తేదీ తుది గడువు
అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రూ.4987.50 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం శనివారం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబరు 19వ తేదీ బిడ్లు దాఖలు చేయడానికి చివరి తేదీగా పేర్కొంది. పోలవరం ప్రాజెక్టులో హెడ్వర్క్సు, మిగిలిన పనులకు రూ.1,887.50 కోట్లు, జలవిద్యుత్ప్రాజెక్టు రూ.3,100 కోట్లకు కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సోమవారం నుంచి ఇ-టెడరింగ్ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుందని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్దాస్ తెలిపారు. అయితే రివర్స్టెండరింగ్కు సంబంధించి జలవనరులశాఖ శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం పైనా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైనా, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించుకోవాలని పీపీఏ సీఈఓ ఆర్కె జైన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, రీ టెండరింగ్ విషయంలో రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గలేదు. పీపీఏ సందేహాలను ఆచరణలో తొలగిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రాజెక్టు వ్యయం తగ్గుతుందని, నిర్ధేశించిన సమయానికే పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. వర్షాకాలం పూర్తవగానే నవంబరు ఒకటో తేదీ నుంచి పోలవరం పనులు మొదలుపెట్టాలని, వేగంగా పనులు ముందుకు సాగితేనే జూన్ 2021 నాటికి పోలవరం పూర్తవుతుందని, అందుకే రివర్స్్టెండరింగ్కు నోటిఫికేషన్ ఇచ్చామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని, పీపీఏ రాసిన లేఖకు సమాధానం సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ట్రాన్స్ట్రాయ్ తో ...
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కాంక్రీటు, ఎర్త్కం రాక్ఫిల్ డ్యాం, విద్యుత్ ప్లాంటు, తదితర పనులకు సంబంధించి 2013 మార్చిలో అప్పటి ప్రభుత్వం ట్రాన్స్ట్రాయ్ కు పనులు అప్పగించింది. అప్పట్లో దీన్ని 14.05 శాతం తక్కువగా పనులు తీసుకుంది. 2018 నాటికి పూర్తిచేసేలా అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం హెడ్వర్క్సులో 61 శాతం, కుడి ఫ్రధాన కాలువలో 99 శాతం, ఎడమ ప్రధాన కాలువ 88 శాతం పనులను పూర్తి చేసింది. దీనికోసం హెడ్వర్క్సుకు రూ.2027 కోట్లు, రెండు ప్రధాన కాలువలకు రూ.1785 కోట్లు, మొత్తం రూ.4865 కోట్లు వెచ్చించింది.